3 నిమిషాలు చదవండి
దేవుడు నిజంగా మనతో మాట్లాడగలరా?
జీవితం అనిశ్చితంగా మారినప్పుడు, ప్రశ్నలు అడగడం సహజం.
నేను ఏ మార్గం ఎంచుకోవాలి?
ఈ సవాలును ఎలా అధిగమించాలి?
నేను సరైన నిర్ణయం తీసుకుంటున్నానా?
ఇలాంటి క్షణాల్లో చాలామంది ఆలోచిస్తారు — దేవుడు ఇప్పటికీ తన పిల్లలతో మాట్లాడతారా అని.
యేసుక్రీస్తు యొక్క తిరిగి స్థాపించిన సువార్త బోధిస్తుంది — ఆయన మాట్లాడతారు.
మన పరలోక తండ్రి ప్రేమగల తండ్రి. ఆయన తన పిల్లలను నడిపించాలని కోరుకుంటున్నారు. జీవిత సవాళ్లను ఒంటరిగా ఎదుర్కొనేలా మనల్ని వదిలిపెట్టలేదు. పరిశుద్ధాత్మ ద్వారా ఆయన తన చిత్తాన్ని వెల్లడి చేస్తూనే ఉన్నారు, ఓదార్పు ఇస్తున్నారు, మార్గనిర్దేశం చేస్తున్నారు. దేవుని నుంచి వచ్చే ఈ పవిత్రమైన సంభాషణనే వ్యక్తిగత ధర్శనం అంటారు.
అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ బోధించారు — ధర్శనం పొందడం “దేవుడు తన పిల్లలకు ఇచ్చిన గొప్ప వరాలలో ఒకటి.” రాబోయే రోజుల్లో ఆధ్యాత్మికంగా బలంగా ఉండాలంటే పరిశుద్ధాత్మ యొక్క నిరంతర ప్రభావం అవసరమని కూడా గుర్తు చేశారు.
వ్యక్తిగత ధర్శనం అంటే ఏమిటి?
వ్యక్తిగత ధర్శనం అనేది దేవుడు తన పిల్లలతో మాట్లాడే మార్గం. పరిశుద్ధాత్మ ద్వారా ఆయన నిజమైన ప్రార్థనలకు సమాధానం ఇవ్వగలరు, సత్యాన్ని నిర్ధారించగలరు, మార్గనిర్దేశం చేయగలరు, తన చిత్తాన్ని అర్థం చేసుకోవడానికి సహాయపడగలరు.
తరచుగా ధర్శనం నాటకీయ అనుభవాల ద్వారా రాదు. లేఖనాలు ఆత్మ స్వరాన్ని “నిశ్శబ్దమైన చిన్న స్వరం”గా వర్ణిస్తాయి. అది శాంతియుత అనుభూతులుగా, ప్రేరణాత్మక ఆలోచనలుగా, మృదువైన ముద్రలుగా, లేదా మనం సరైన దిశలో వెళ్తున్నామనే సౌమ్యమైన నమ్మకంగా రావచ్చు.
ప్రభువు ఇంకా బోధిస్తున్నారు ధర్శనం“వరుసగా, సూత్రం వరుసగా” వస్తుంది. అన్నీ ఒక్కసారిగా వెల్లడి చేయకుండా, ఆయన తరచుగా ఒక్కో అడుగు చొప్పున నడిపిస్తారు. మనం పొందిన మార్గనిర్దేశంపై విశ్వాసంతో చర్య తీసుకున్నప్పుడు, ప్రభువు మరింత అవగాహన, నమ్మకం, తదుపరి దిశను ఇస్తారు. ప్రతి విధేయతా అడుగు మరింత వెలుగు, సత్యం పొందడానికి మనల్ని సిద్ధం చేస్తుంది.

దేవుడు తన ప్రతి పిల్లలతోను మాట్లాడాలని కోరుకుంటున్నారు
కొన్నిసార్లు మనం అనుకుంటాం ధర్శనం కేవలం ప్రవక్తలకు లేదా సంఘ నాయకులకు మాత్రమే అని. సంఘాధ్యక్షులు మొత్తం సంఘాన్ని నడిపించడానికి ధర్శనం పొందుతారు నిజమే. కానీ యేసుక్రీస్తు యొక్క ప్రతి శిష్యుడూ తన స్వంత జీవితం కోసం ధర్శనం పొందగలరు.
అధ్యక్షులు నెల్సన్ సాక్ష్యమిచ్చారు:
“ఆత్మ నా మనస్సుపై మళ్లీ మళ్లీ ముద్ర వేసిన విషయాలలో ఒకటి ప్రభువు తన మనస్సును, చిత్తాన్ని వెల్లడి చేయడానికి ఎంత సిద్ధంగా ఉన్నారో.”
ఎంత ఆదరణీయమైన వాగ్దానం. మన పరలోక తండ్రి మన పరిస్థితులను పరిపూర్ణంగా ఎరుగుతారు. మన ఆందోళనలు, బాధ్యతలు, హృదయాల్లోని ప్రశ్నలు ఆయనకు తెలుసు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నారు కాబట్టి, ప్రార్థన ద్వారా, పరిశుద్ధాత్మ సహవాసం ద్వారా తన మార్గనిర్దేశం కోసం వెతకమని ఆహ్వానిస్తున్నారు. మనం నిజాయితీగా ఆయనను వెతికినప్పుడు, ఆయన నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడతారు, సవాళ్లలో బలపరుస్తారు, తన పరిపూర్ణ జ్ఞానం ప్రకారం నడిపిస్తారు.
ధర్శనం పొందడానికి మనం ఎలా సిద్ధం కావాలి?
ధర్శనం పొందడం ఒక వరం, అదే సమయంలో అభ్యాసంతో పెరిగే ఆధ్యాత్మిక నైపుణ్యం కూడా.
లేఖనాలు బోధిస్తున్నాయి నిజాయితీగా ప్రార్థించడం, దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయడం, ఆయనను ఆరాధించడం, ప్రతిరోజూ పశ్చాత్తాపపడటం, ఆయన ఆజ్ఞలను పాటించడానికి ప్రయత్నించడం ద్వారా మనం సిద్ధమవుతాం. ప్రభువుకు దగ్గరవుతున్న కొద్దీ, ఆయన స్వరాన్ని గుర్తించే సామర్థ్యం పెరుగుతుంది.
అధ్యక్షులు నెల్సన్ ఈ ఆహ్వానం ఇచ్చారు:
“దేవుని ముందు మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. మీ పరలోక తండ్రికి మీ హృదయాన్ని కుమ్మరించండి… ఆపై వినండి! మీ మనస్సులోకి వచ్చే ఆలోచనలను రాసుకోండి. మీ అనుభూతులను నమోదు చేసుకోండి, ఆ ప్రేరణలపై చర్య తీసుకోండి. మనం విశ్వాసంతో స్పందించినప్పుడు, ప్రభువు మనల్ని నడిపిస్తూనే ఉంటారు, మనం ఆయన చిత్తంలో నడుస్తున్నామని నిర్ధారిస్తారు.”
ఆయన ఇంకా బోధించారు పెరిగిన పవిత్రత, ఖచ్చితమైన విధేయత, నిజాయితీగా వెతకడం, ప్రతిరోజూ క్రీస్తు మాటలను ఆస్వాదించడం, మందిరం మరియు కుటుంబ చరిత్ర పనికి క్రమం తప్పకుండా సమయం కేటాయించడం వంటివి ఆకాశాలను తెరవడానికి సహాయపడతాయి. మనం ఇవి నిలకడగా చేసినప్పుడు, ఆధ్యాత్మికంగా మరింత సున్నితంగా మారుతాం. కాలక్రమేణా పరిశుద్ధాత్మ స్వరాన్ని మరింత స్పష్టంగా గుర్తించి, ప్రభువు ఇచ్చే మార్గనిర్దేశాన్ని నమ్మడం నేర్చుకుంటాం.

ఈ రోజు వ్యక్తిగత ధర్శనం ఎందుకు అవసరం?
మనం అనేక స్వరాలు దృష్టిని ఆకర్షించే ప్రపంచంలో జీవిస్తున్నాం. వార్తలు, సామాజిక మాధ్యమాలు, జనాదరణ పొందిన అభిప్రాయాలు మన ఆలోచనలను, చర్యలను సులభంగా ప్రభావితం చేయగలవు. అలాంటి ప్రపంచంలో ఆత్మ స్వరాన్ని గుర్తించడం ఎప్పటికంటే ముఖ్యం.
అధ్యక్షులు నెల్సన్ హెచ్చరించారు:
“రాబోయే రోజుల్లో, పరిశుద్ధాత్మ యొక్క నడిపించే, దర్శకత్వం వహించే, ఓదార్చే, నిరంతర ప్రభావం లేకుండా ఆధ్యాత్మికంగా బతకడం సాధ్యం కాదు.”
ఇది కేవలం ఆహ్వానం కాదు ఇది సిద్ధం కావాలనే ప్రవచనాత్మక పిలుపు. ప్రతిరోజూ ప్రార్థన, లేఖన అధ్యయనం, ఆరాధన ద్వారా ప్రభువుకు సమయం కేటాయించినప్పుడు, మనం పరిశుద్ధాత్మ సహవాసాన్ని ఆహ్వానిస్తాం. ఆయన సత్యాన్ని గుర్తించడానికి, తెలివైన నిర్ణయాలు తీసుకోవడానికి, అనిశ్చితిలో శాంతి కనుగొనడానికి, అంతరాయాలతో నిండిన ప్రపంచంలో రక్షకునికి దగ్గరగా ఉండటానికి సహాయపడతారు.
ప్రవక్త నుంచి ఒక వాగ్దానం

అధ్యక్షులు నెల్సన్ వాగ్దానం చేశారు వ్యక్తిగత ధర్శనం పొందడం నేర్చుకోవడం మన జీవితంలోని ప్రతి భాగాన్ని ఆశీర్వదిస్తుంది.
ఆయన ప్రకటించారు:
“మీరు మీ కోసం నేర్చుకోవచ్చు… వ్యక్తిగత ధర్శనను ఎలా పొందాలో. దానికంటే మీ జీవితంలో పెద్ద తేడా తీసుకురాగలది మరొకటి లేదు!”
ఆయన ఇంకా వాగ్దానం చేశారు పరిశుద్ధాత్మ యొక్క మృదువైన స్వరాలను వినడానికి అవసరమైన ఆధ్యాత్మిక పనిని నిజాయితీగా చేసినప్పుడు, ప్రభువు మనకు కావాల్సిన మార్గనిర్దేశం ఇస్తారు. ఆయన సమాధానాలు ఎల్లప్పుడూ వెంటనే లేదా మనం అనుకున్న విధంగా రాకపోవచ్చు. కానీ ఆయన మనల్ని ఒక్కో అడుగు చొప్పున నడిపిస్తారు, శాంతి, స్పష్టత, నమ్మకం ఇస్తారు మనం ఆయనను నమ్ముతూ ముందుకు సాగినప్పుడు.
పరలోక తండ్రి మీతో మాట్లాడాలని కోరుకుంటున్నారు. మీరు విశ్వాసంతో ఆయనను వెతికినప్పుడు, ప్రతిరోజూ ఆయనకు సమయం కేటాయించినప్పుడు, పొందిన ప్రేరణలను అనుసరించినప్పుడు వ్యక్తిగత ధర్శనం కొద్దిమందికి మాత్రమే కాదని మీరు కనుగొంటారు. అది వినడానికి సిద్ధంగా ఉన్న దేవుని ప్రతి పిల్లవాడికీ అందుబాటులో ఉన్న పవిత్రమైన వరం. పరిశుద్ధాత్మ ద్వారా ప్రభువు మీ నిర్ణయాలను నడిపించగలరు, మీ విశ్వాసాన్ని బలపరచగలరు, నిబంధన మార్గంలో నమ్మకంతో నడవడానికి సహాయపడగలరు.
మీకు ఇవి కూడా ఆసక్తికరంగా ఉండవచ్చు:
- ఉపవాసం యొక్క ఉద్దేశం ఏమిటి?
- మనం ఆధ్యాత్మికంగా “బలహీనంగా” ఉన్నప్పుడు మనకు అవసరమైన 3 సలహాలు
- కుటుంబ చరిత్ర పేర్ల కంటే ఎంతో మిన్నది: కుటుంబ చరిత్ర ఎందుకు ముఖ్యం?
సంబంధించిన వీడియో
