3నిమిషాలు చదవండి
దేవుడు తనను కాపరితో ఎందుకు పోల్చుకున్నారు?
రాజు ఆజ్ఞాపిస్తారు.
ఉపాధ్యాయుడు బోధిస్తారు.
న్యాయమూర్తి తీర్పు ఇస్తారు.
అయితే బైబిల్ ప్రభువును కాపరిగా ఎందుకు వర్ణిస్తుంది?
మొదట ఈ పోలిక కొంచెం వింతగా అనిపించవచ్చు. మనలో చాలామంది ఎప్పుడూ గొర్రెలను చూసుకోలేదు లేదా కాపరితో కలిసి విశాలమైన మైదానాల్లో నడవలేదు. అయినప్పటికీ, ఈ సాధారణమైన చిత్రం శతాబ్దాలుగా కోట్లాది మందికి ఓదార్పునిచ్చింది.
దావీదు 23వ కీర్తనను మనకు పరిచయమైన ఈ మాటలతో ప్రారంభించాడు:
“యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు.”
— కీర్తనలు 23:1
అయితే దావీదు దీని ద్వారా నిజంగా ఏమి బోధించాలనుకున్నాడు? ఈ చిత్రం నేటికీ ఎందుకు ముఖ్యమైనది?
“ప్రభువు నా కాపరి” అంటే ఏమిటి?
ఒక కాపరికి తన ప్రతి గొర్రె గురించి వ్యక్తిగతంగా తెలుసు.
అతను వాటిని ఆహారం మరియు నీరు ఉన్న చోటికి నడిపిస్తారు , ప్రమాదాల నుంచి కాపాడతారు, అవి దారి తప్పినప్పురు వాటి కోసం వెతుకుతారు . ప్రయాణం కష్టంగా మారిందని వాటిని ఎప్పుడూ వదిలిపెట్టరు.
యేసుక్రీస్తు కూడా మన పట్ల అలాగే శ్రద్ధ చూపుతారు.
ఆయన పరలోకం నుంచి మనలను చూస్తూ ఉండే దూరమైన రక్షకుడు కాదు. మన భయాలు, మన కష్టాలు, మన వ్యక్తిగత అవసరాలు ఆయనకు తెలుసు. ఆయన ఓర్పుతో మనకు దారి చూపుతారు, ప్రేమతో మనలను సరిదిద్దుతారు, తనను అనుసరించమని ఎల్లప్పుడూ ఆహ్వానిస్తారు.
అధ్యక్షుడు థామస్ ఎస్. మాన్సన్ ఒకసారి జర్మనీలో ఒక కాపరిని గమనించిన అనుభవాన్ని వివరించారు. ఆ కాపరి ఎటు వెళ్లినా—ఎడమవైపు లేదా కుడివైపు—గొర్రెలు అతన్ని అనుసరించాయి. ఎందుకంటే అవి అతన్ని పూర్తిగా నమ్మాయి.అదే విధంగా, ముందున్న దారి మొత్తం మనకు కనిపించకపోయినా, రక్షకుడి నడిపింపును నమ్మాలని ఆయన మనలను ఆహ్వానిస్తున్నారు.
రక్షకుడు నేడు మనకు ఎలా దారి చూపిస్తారు?
23వ కీర్తన ఇలా చెబుతోంది:
పచ్చికగల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలములయొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేదదీర్చుచున్నాడు. తన నామమునుబట్టి నీతిమార్గములలో నన్ను నడిపించుచున్నాడు.
— కీర్తనలు 23:2–3
జీవితం తరచుగా ఎన్నో ఆలోచనలతో, ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులతో నిండి ఉంటుంది. మనం కష్టమైన నిర్ణయాలను ఎదుర్కొంటాం, నిరాశలకు గురవుతాం, కొన్నిసార్లు ఏ దారిలో వెళ్లాలో కూడా మనకు తెలియదు.
రక్షకుడు నేటికీ తన ప్రజలకు దారి చూపిస్తున్నారు.
లేఖనాలు, పరిశుద్ధాత్మ, జీవిస్తున్న ప్రవక్తలు, వ్యక్తిగత బయల్పాటు ద్వారా ఆయన మనకు దారి చూపిస్తారు. ఆయన చూపించే దారి ఎల్లప్పుడూ మన కష్టాలను తొలగించకపోవచ్చు. కానీ ముందుకు సాగడానికి మనకు శాంతిని, ధైర్యాన్ని ఇస్తుంది.
ప్రేమగల కాపరి తన మందను నడిపించినట్లుగా, మన దారిని మనమే వెతుక్కునేలా వదిలేయకుండా, ఆయన మనకు ముందుండి నడిపిస్తారు.
కాపరి ప్రతి కష్టాన్ని ఎందుకు తొలగించరు?

23వ కీర్తనలో ఓదార్పునిచ్చే ఒక వచనం ఇలా చెబుతోంది:
“గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడై యుందువు”
— కీర్తనలు 23:4
దావీదు ఏమి చెప్పలేదో గమనించండి. కాపరి ఆ లోయను తొలగిస్తాడని అతను చెప్పలేదు.
దానికి బదులుగా, కాపరి అతనితో కలిసి ఆ లోయ గుండా నడుస్తారు.
ఇది సువార్తలోని గొప్ప వాగ్దానాల్లో ఒకటి. యేసుక్రీస్తు బాధలు లేని జీవితాన్ని వాగ్దానం చేయరు.
ఎల్డర్ డైటర్ ఎఫ్. ఉచ్డార్ఫ్ బోధించినట్లుగా, మనకు ఒక విజేత—ఒక రక్షకుడు ఉన్నారు. ఆయన మన కోసం మరణ ఛాయగల లోయ గుండా నడిచారు. ఆయన వల్ల, దారి చీకటిగా ఉన్నప్పుడు కూడా మనం ధైర్యాన్ని పొందగలము.
కర్ర మరియు దండము మనకు ఏమి నేర్పిస్తాయి?
దావీదు ఇంకా ఇలా రాశాడు:
“నీ దుడ్డుకఱ్ఱయు నీ దండమును నన్ను ఆదరించును.”
— కీర్తనలు 23:4
కాపరి ప్రమాదాల నుంచి గొర్రెలను కాపాడటానికి దండను ఉపయోగించేవాడు.
దారి తప్పిన గొర్రెలను తిరిగి సురక్షితమైన దారిలోకి తీసుకురావడానికి కర్రను ఉపయోగించేవాడు.
ఈ రెండూ రక్షకుడి ప్రేమను సూచిస్తాయి.
కొన్నిసార్లు మనకు కనిపించని ప్రమాదాల నుంచి ఆయన మనలను కాపాడతారు. మరికొన్ని సందర్భాల్లో మనం ఆయనకు దూరంగా వెళ్లడం ప్రారంభించినప్పుడు ప్రేమతో మనలను సరిదిద్దుతారు. ఆయన మనలను శిక్షించడానికి కాదు, సురక్షితంగా ఇంటికి తీసుకురావడానికి దారి చూపిస్తారు.
మనలను సరిదిద్దడం కూడా ఆయన మనపై చూపించే శ్రద్ధలో ఒక భాగమే.
మనం కాపరిని మరింత దగ్గరగా ఎలా అనుసరించగలం?
కాపరి చూపించే దారిని అనుసరించడానికి సిద్ధంగా ఉన్న గొర్రెలనే ఆయన నడిపించగలరు
యేసుక్రీస్తుతో మన సంబంధం కూడా అలాగే ఉంటుంది.
మనం నిజాయితీగా ప్రార్థించినప్పుడు, లేఖనాలను చదివినప్పుడు, ఆయనను ఆరాధించినప్పుడు, ఆయన ఆజ్ఞలను పాటించడానికి ప్రయత్నించినప్పుడు ఆయన స్వరాన్ని గుర్తించడం నేర్చుకుంటాం. ప్రతిరోజూ ఆయనను నమ్మాలని ఎంచుకున్నప్పుడు, ఆయన చూపించే దారిని మరింత స్పష్టంగా గుర్తించగలుగుతాం, ఆయన వాగ్దానాలపై మరింత నమ్మకం పెరుగుతుంది.
కాపరిని అనుసరించడం అంటే మన జీవితంలో ఎప్పుడూ అనిశ్చితి ఉండదని కాదు. మనలను ఎవరు నడిపిస్తున్నారో మనకు తెలుసని అర్థం.
కాపరి తన గొర్రెలను ఎప్పుడూ గమనిస్తూనే ఉంటాడు
23వ కీర్తన కేవలం అందమైన కవిత్వం కంటే ఎంతో ఎక్కువ.
యేసుక్రీస్తుకు మనలో ప్రతి ఒక్కరి గురించి వ్యక్తిగతంగా తెలుసని ఇది మనకు గుర్తుచేస్తుంది. మనకు నిజంగా అవసరమైన వాటిని ఆయన ఇస్తారు. మనం అలసిపోయినప్పుడు మన హృదయాలకు విశ్రాంతినిస్తారు. ప్రమాద సమయాల్లో మనలను కాపాడతారు. జీవితంలోని చీకటి లోయల్లో కూడా మన పక్కనే ఉంటారు.
కాపరి యొక్క గొప్ప కోరిక కేవలం ఈ జీవితంలో మనకు దారి చూపించడం మాత్రమే కాదు. మనలను సురక్షితంగా పరలోక తండ్రి వద్దకు తిరిగి తీసుకెళ్లడం.
23వ కీర్తనలోని అద్భుతమైన వాగ్దానం ఏమిటంటే, మనం ఆయనను అనుసరిస్తూ ఉంటే, మన ప్రయాణంలో మనం ఎప్పుడూ ఒంటరిగా ఉండము.
మీకు ఇవి కూడా ఆసక్తికరంగా ఉండవచ్చు:
