పన్నెండు మంది అపోస్తలుల సమూహం , యేసు క్రీస్తు సంఘం, మొదటి ప్రెసిడెన్సీ, డాలిన్ హెచ్. ఓక్స్
3 నిమిషాలు చదవండి
ఎడిటర్స్ నోట్: క్యాథలిక్ చర్చి కొత్త పోప్ను ఎన్నుకోవడానికి ఎలా సిద్ధపడుతుందో చూసి, చాలా మందికి ఇతర మతాలలో ఇలాంటి ప్రక్రియ ఎలా జరుగుతుందో అని సందేహం వస్తుంది. ‘యేసుక్రీస్తు కడవరి దిన పరిశుద్ధుల సంఘం ‘ విషయంలో చూసుకుంటే.. కొత్త ప్రెసిడెంట్ నియామకం అనేది సాధారణ ఎన్నికలు లేదా ప్రజల ఓటింగ్ ద్వారా జరగదు. చర్చి సభ్యులు ఈ ప్రెసిడెంట్ను ఒక ప్రవక్తగా, ముందుచూపు ఉన్న వ్యక్తిగా, దేవుని విషయాలను వెల్లడించేవానిగా భావిస్తారు. ఈ ఎంపిక ప్రక్రియ చాలా పవిత్రమైనది, క్రమబద్ధమైనది మరియు ఎంతో గౌరవప్రదమైనది.
ఈ చర్చిలో అందరికంటే అత్యున్నత అధికార విభాగం మొదటి ప్రెసిడెన్సీ. ఇందులో చర్చి ప్రెసిడెంట్ మరియు ఆయనకు సహాయకులుగా ఇద్దరు కౌన్సిలర్లు ఉంటారు. ఈ ముగ్గురు వ్యక్తుల సమూహం చర్చి యొక్క నియమ నిబంధనలు, సంస్థ మరియు పరిపాలన వ్యవహారాలన్నింటినీ చూసుకుంటుంది.

చర్చిలో రెండవ అత్యున్నత అధికార విభాగం పన్నెండు మంది అపొస్తలుల కోరం ఈ అపొస్తలులు మొదటి ప్రెసిడెన్సీ కింద పనిచేస్తారు. ప్రపంచవ్యాప్తంగా చర్చి పనులను, అభివృద్ధిని నడిపించడంలో వీరికి పెద్ద పరిపాలనా బాధ్యతలు ఉంటాయి. మొదటి ప్రెసిడెన్సీ మరియు ఈ పన్నెండు మంది అపొస్తలులు ఇద్దరినీ కూడా చర్చి సభ్యులు ప్రవక్తలుగా భావిస్తారు. చర్చిని నడిపించడానికి వీరు దేవుని నుండి సూచనలు మరియు ప్రేరణలు అందుకుంటారని నమ్ముతారు.

చర్చికి కొత్త ప్రెసిడెంట్ను నియమించే పద్ధతి చాలా క్రమశిక్షణతో జరుగుతుంది. నేటి ప్రపంచంలో ఇదొక విచిత్రమైన విషయం, ఎందుకంటే ఈ పదవి కోసం చర్చి లోపల ఎలాంటి ప్రచారాలు లేదా పోటీలు ఉండవు. ఈ ప్రక్రియ అంతా దేవుని ద్వారానే జరుగుతుందని, ఎలాంటి పబ్లిక్ ఎన్నికలు లేదా ప్రైవేట్ చర్చలకు ఇక్కడ తావు లేదని సభ్యులు నమ్ముతారు.
అంతేకాకుండా, కేవలం చర్చి నియమాలు మాత్రమే ఈ పద్ధతిని నడిపించవు. పెద్ద పదవుల కోసం ఆశపడటం లేదా స్వార్థం చూపించడం తప్పు అనే బలమైన సాంప్రదాయం ఇక్కడ ఉంది. దీనికి బదులుగా, ఒక వ్యక్తి యొక్క మంచి ప్రవర్తనకు మరియు దేవుడు పిలిచినప్పుడు వినయంగా సేవ చేయడానికి సిద్ధంగా ఉండే గుణానికే ఇక్కడ ప్రాధాన్యత ఇస్తారు.
చర్చి ప్రవక్త మరణించినప్పుడు ఏం జరుగుతుంది?
- మొదటి ప్రెసిడెన్సీ అనే విభాగం వెంటనే రద్దు అవుతుంది.
- మొదటి ప్రెసిడెన్సీలో ఉన్న ఇద్దరు కౌన్సిలర్లు తిరిగి పన్నెండు మంది అపొస్తలుల గ్రూపులోకి వచ్చేస్తారు. అక్కడ వారు అపొస్తలులుగా నియమించబడిన తేదీని బట్టి వారి సీనియారిటీ స్థానంలో కూర్చుంటారు. ఇక్కడ సీనియారిటీని వయసును బట్టి కాకుండా, వారు అపొస్తలుడిగా బాధ్యతలు తీసుకున్న తేదీని బట్టి లెక్కిస్తారు.
- ఇప్పుడు మొత్తం 14 మంది సభ్యులు ఉన్న పన్నెండు మంది అపొస్తలుల కోరం చర్చి పూర్తి బాధ్యతలను తన చేతుల్లోకి తీసుకుంటుంది. అందరికంటే అత్యంత సీనియర్ అపొస్తలుడు దీనికి నాయకత్వం వహిస్తారు.
- అందరికంటే పెద్ద వయసున్న అపొస్తలుడు మిగతా అపొస్తలులందరితో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి, రెండు ప్రశ్నలపై చర్చిస్తారు:
- మొదటి ప్రెసిడెన్సీని ఇప్పుడే మళ్లీ ఏర్పాటు చేయాలా?
- లేదా ప్రస్తుతానికి పన్నెండు మంది అపొస్తలుల గ్రూపు నాయకత్వంలోనే చర్చి పనులను కొనసాగించాలా?
- ఈ చర్చ జరిగిన తర్వాత, అపొస్తలుల గ్రూపు ఒక అధికారిక నిర్ణయాన్ని అంగీకరిస్తుంది.
- ఒకవేళ మొదటి ప్రెసిడెన్సీని మళ్లీ ఏర్పాటు చేయడానికి అందరూ ఒప్పుకుంటే.. అపొస్తలులందరూ కలిసి ఏకగ్రీవంగా చర్చికి కొత్త ప్రెసిడెంట్ను ఎన్నుకుంటారు. చర్చి చరిత్రలో ఎప్పుడూ కూడా.. అందరికంటే ఎక్కువ కాలం అపొస్తలుడిగా సేవ చేసిన అత్యంత సీనియర్ వ్యక్తినే కొత్త ప్రెసిడెంట్గా పిలవడం జరుగుతోంది.
- ఈ ఎంపిక ముగిసిన తర్వాత, రెండవ అత్యంత సీనియర్ అపొస్తలుడిని పన్నెండు మంది అపొస్తలుల కోరమ్కు ప్రెసిడెంట్గా నియమిస్తారు. ఒకవేళ ఆయన కూడా మొదటి ప్రెసిడెన్సీలో కౌన్సిలర్గా ఎంపికైతే, మూడవ అత్యంత సీనియర్ అపొస్తలుడు ఈ కోరమ్కు ప్రెసిడెంట్గా బాధ్యతలు తీసుకుంటారు.
- చివరగా, పన్నెండు మంది అపొస్తలుల కోరం ప్రెసిడెంట్ మరియు మిగిలిన అపొస్తలులందరూ కలిసి కొత్తగా ఎన్నికైన చర్చి ప్రెసిడెంట్ తలపై చేతులు ఉంచి ఆయనను అధికారికంగా దేవుని సేవకు నియమిస్తారు.
ఏప్రిల్ 6, 1830న చర్చి అధికారికంగా స్థాపించబడినప్పటి నుండి ఇప్పటివరకు 17 మంది ప్రెసిడెంట్లు సేవ చేశారు. గతంలో ఉన్న ప్రెసిడెంట్ రస్సెల్ ఎమ్. నెల్సన్ సెప్టెంబర్ 27, 2025న మరణించగా, ప్రస్తుత ప్రెసిడెంట్ డాలిన్ హెచ్. ఓక్స్ అక్టోబర్ 14, 2025 న చర్చి కొత్త ప్రవక్తగా బాధ్యతలు స్వీకరించారు.
మూలం: చర్చ్ న్యూస్
మీకు ఇవి కూడా ఆసక్తికరంగా ఉండవచ్చు:
- స్నేహితుల కోసం ప్రార్థించి, దేవాలయంలో వారిని కనుగొన్న యువకుడి కథ
- అధ్యక్షుడు నెల్సన్: మరేదీ ఇవ్వలేని విధంగా ఈ దేవాలయం మీ జీవితాన్ని ఆశీర్వదిస్తుందని నేను మీకు వాగ్దానం చేస్తున్నాను.
- మోర్మన్ గ్రంథం: క్రీస్తు పునరుత్థానానికి ఒక సాక్ష్యం
సంబందించిన వీడియో
